కొందరు దయ్యాలు ఉన్నాయని.. మరి కొందరు లేవని అంటూ ఉంటారు. అయితే దయ్యాలు ఉంటే ఎందుకు కనిపించడం లేదు అనేది చాలా మంది ప్రశ్న. కొందరూ మేం దయ్యాలను చూశాం.. అంటే మరి కొందరు వారి భ్రాంతి అని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. హేతువాదుల దృష్టిలో అతీంద్రశక్తుల ఆలోచనే అర్థరహితం.
మీరు కూడా ఈ కోవకు చెందిన వ్యక్తేనా? అయితే దయ్యాలు ఉన్నాయా లేవా అనే వాదన పక్కనబెట్టి వాటి గురించి ఆసక్తికరమైన ఈ విశేషాలు తెలుసుకోండి… ప్రపంచంలోని చాలా మతాల్లో ఏదో ఒక సందర్భంలో దయ్యాల ప్రస్తావన ఉంటుంది. భూతం అనే పదంకు గతం అని అర్ధం వస్తుంది. మనిషి శరీరాన్ని విడిచిన తర్వాత.. మరో జన్మ ఎత్తడానికి మధ్య ఉండే దశే దయ్యం అని ప్రాచీన గ్రంథాలు అంటున్నాయి. అందుకే ఆత్మలు శరీరం లేకుండా తిరగాడుతుంటాయి. మానవ శరీరం పంచ భూతాలతో రూపొందింది.
అవి గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని. మిగతా వాటితో పోలిస్తే.. మనిషి దేహంలో నీరు, మట్టి ఎక్కువగా ఉంటాయి. అందుకే అవి కనిపించవు. కొందరికి మాత్రం దయ్యాలు కనిపించడమే కాదు.. వేధిస్తుంటాయి కూడా. ఇందుకు కారణం వారి జన్మకుండలిలో చంద్రుడు బలహీనంగా ఉండటమే. ఎవరినైన దయ్యం పట్టి పీడిస్తుంటే.. ఆ వ్యక్తి కళ్లు ఎరుపు రంగులోకి మారతాయి. స్థిరంగా, మూత పడకుండా ఎప్పుడూ సగం వరకు తెరుచుకొని ఉంటాయి. మొండితనంగా ఉంటారు. సదరు వ్యక్తిని నుంచి నిరంతరం చెమట వాసన వస్తుంటుంది. మనిషి చనిపోయిన నిమిషం నుండి కర్మకాండలు ముగిసే వరకూ ఆత్మ ఉండే స్థితిని ప్రేతం అంటారు.
{youtube}VU4qgEOjYlc{/youtube}
Related