ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి ఇపుడు జంతువుల పై కూడా పంజా విసురుతోంది. తాజాగా నగరంలోని వీధి కుక్కలలో కోవిడ్ లక్షణాలు కన్పించడం ఇప్పుడు నగరవాసుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో వీధి కుక్కలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆయాస పడుతూ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. రోడ్లపై పడిపోతూ.. నీరసంగా కనిపిస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి కుక్కలు.
కొవిడ్ లక్షణాలు జంతువులలో కన్పించడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ మద్యనే హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్క్లోని ఎనిమిది సింహాలలో కరోనా లక్షణాలు కన్పించడం అందరిని షాక్కు గురి చేసింది. దీంతో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) అధికారులు ఈ సింహాలకు నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ తేలింది.
దాంతో జూపార్క్కు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరించారు. తాజాగా కుక్కల పరిస్థితి తీవ్రస్థాయిలో విషమించడం కలవరం రేపుతుంది. ఇప్పటికై ప్రభుత్వం చొరవ తీసుకుని జంతువులకు పరీక్షలు నిర్వహించి జంతువుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.