Sunday, May 5, 2024
- Advertisement -

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన దిలీప్‌ కుమార్‌!

- Advertisement -

ఇటీవల బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ (98) ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఆయనను ముంబయిలోని హిందూజా ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి చేశారు. అయితే, ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ కొనసాగించాలని వైద్యులు నిర్ణయించారు. ఇటీవల తీవ్రస్థాయిలో శ్వాస సంబంధిత అనారోగ్యానికి గురయ్యారు. ఈ నెల 6న జరిపిన వైద్య పరీక్షలో ఆయన బైలేటరల్ ప్లూరల్ ఎఫ్యూజన్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది.

శుక్రవారం ఆసుపత్రి బయట ఆయన భార్య సైరాభాను మీడియాతో మాట్లాడుతూ.. దిలీప్‌ ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లు ఆయన్ను బాగా రెస్ట్‌ తీసుకోమని, కొన్ని యాంటి బయాటిక్స్‌ రెగ్యులర్‌గా వాడమని చెప్పారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు అందరికీ, చికిత్స అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు అని ఆమె అన్నారు.

ఓ దశలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, పరిస్థితి విషమంగా మారిందని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన అర్ధాంగి సైరా బాను సోషల్ మీడియాలో స్పష్టతనివ్వడంతో పుకార్లుకు తెరపడింది.

‘ఓ మై గాడ్’ సీక్వెల్​.. హీరోయిన్​ ఎవరంటే?

సమంత కొడుకుగా నటించేది ఆ స్టార్ హీరో కొడుకే?

బడా బ్యానర్లన్నీ సంతోష్ శోభన్ చుట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -