కన్నడ బ్యూటీ హీరోయిన్ ప్రణీత తెలుగు ఇండస్ట్రీకి “ఏం పిల్లో ఏం పిల్లడో ” మూవీతో హీరోయిన్గా పరిచయమై ఆ మూవీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సిద్దార్థ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “బావ” సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తర్వాత పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” మూవీలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటించి అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ప్రస్తుతం ప్రణీత బాలీవుడ్ల్లో హీరోయిన్ గా పాగా వేసి దాదాపు రెండు సినిమాల్లో నటించింది.ఇటీవలే ప్రణీత సుభాస్ వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న వివాహం చేసుకుని అభిమానులను ఆశ్చర్య పరిచింది. తాజాగా తన వివాహం పై స్పందించి ప్రణీత సుభాష్ ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కరోనా ప్రభావం, ఆషాడం కారణంగా మా పెళ్లి చాలా నిరాడంబరంగా చేసుకోవాల్సి వచ్చింది చెప్పుకొచ్చింది.
Also read:హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!
అలాగే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి ఎంతోమంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజం ఇలాంటి క్లిష్ట పరిస్థితులను చూస్తున్న క్రమంలో మేము అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవడం మంచిది కాదని భావించి చాలా సింపుల్ గా చేసుకున్నామని తెలిపింది. ప్రణీత కెరీర్ విషయానికి వస్తే తాజాగ ప్రణీత హిందీలో నటించిన “భుజ్”చిత్రం ఓటీటీలో విడుదలై సక్సెస్ సాధించింది. మరో బాలీవుడ్ మూవీ “హంగామా-2” విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కన్నడలో “రమణ అవతార” సినిమాలో నటిస్తోంది.
Also read:పార్టీలో డ్రగ్స్… నటి అరెస్ట్.. ఎవరంటే?