Saturday, April 27, 2024
- Advertisement -

ఆ విషయంలో నన్ను క్షమించండి అంటున్న కొత్త పెళ్ళికూతురు..!

- Advertisement -

“ఏం పిల్లో.. ఏం పిల్లడో” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకునే వారు. కానీ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకోకుండా పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఎంతో షాక్ కి గురయ్యారు.

నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా నటి ప్రణీత పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి.నటి ప్రణీత బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్త నితిన్ తో వివాహం చేసుకుందని సోషల్ మీడియాలో ఆమె పెళ్లి ఫోటోలు చక్కర్లు కొట్టడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత తన పెళ్లి గురించి ముందుగానే చెప్పకపోవడంతో అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రణీత తన అభిమానులను శాంతపరిచే పనిలో పడ్డారు.

Also read:ఆ వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్?

పెళ్లి అనంతరం తన అభిమానులను ఉద్దేశించి ప్రణీత తన పెళ్లి పై కీలక ప్రకటన చేశారు. మే 30న పెళ్లి చేసుకుంన్నాం అనే విషయాన్ని ప్రకటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నటి ప్రణీత తెలిపారు. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి ముందుగా ఎలాంటి ప్రకటన చేయలేక పోయాను… అందుకు మీరు నన్ను క్షమించండి.. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో పెళ్లి తేదీని చివరి వరకు మేము కూడా నిర్ణయించుకోలేక పోయాము. అందుకోసమే ముందుగా అభిమానులకు తెలియజేయలేదు.నా పెళ్లి గురించి ఏదో ఒక డేట్ చెప్పి అందర్నీ కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేకే ముందుగా తన పెళ్లి తేదీని ప్రకటించలేదని ఈ సందర్భంగా ప్రణీత తెలియజేశారు. ప్రస్తుతం ప్రణీత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:బిగ్ బాస్ లోకి చిన్నారి పెళ్ళికూతురు… షో ఎప్పుడు ప్రారంభమంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -