సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆయన కళ్లకు తీవ్ర గాయాలైనట్టు డాక్టర్లు చెప్పారు. నెల్లూరు, చెన్నై ప్రధాన రహదారిలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కత్తి మహేశ్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కత్తి మహేశ్కు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.
అయితే ఆయన వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షల ఆర్థిక సాయం చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ సాయం చేసినట్టు సమాచారం.ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో కత్తి మహేశ్ పాపులర్ అయ్యారు. నిరంతరం ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండే కత్తి మహేశ్.. హిందూ దేవుళ్లు, హిందూ సంప్రదాయాలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటాడు. దీంతో ఆయనకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఇటు హిందూ వాదుల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది.
Also Read: శనగలు నానబెట్టిన నీటిని పడేస్తున్నారా.. అయితే ఈ పోషకాలు కోల్పోయినట్లే?
ఇక ఇటీవల ప్రమాదానికి గురైన సందర్భంలో నెటిజన్స్ కత్తి మహేశ్కు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు. దీంతో అలాంటి వారిపై విమర్శలు వచ్చాయి. ఓ మనిషి చావు బతుకులో ఉన్నప్పుడు పైశాచిక ఆనందం పొందడం సరికాదని కొందరు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు ఆర్థిక సాయం చేయడం గమనార్హం.
Also Read: ఆల్ఫా, డేల్టా వేరియంట్ ఏదైనా.. కోవాగ్జిన్ అ సూపర్..!