ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో త్వరలో థర్డ్వేవ్ వస్తుందని.. చిన్నపిల్లలకు ఎక్కువ ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. తాజాగా కేంద్రం చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది.
జైడస్ క్యాడిల్లా సంస్థ రూపొందించిన డీఎన్ఏ ఆధారిత జైకోవ్-డీ (ZyCoV-D) కరోనా వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుపుతోందని, ఈ ట్రయల్స్ పూర్తయితే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఈ విషయంపై ఓ బాలుడు కోర్టుకు వెళ్లాడు. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదని టియా గుప్తా అనే బాలుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈరోజు ఈ విషయంపై వాదనలు జరగగా కేంద్రప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
Also Read : ఆక్సిజన్ బాటిల్స్ వచ్చేశాయి.. జేబులో పెట్టుకోవచ్చు
అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిల్లా అనే సంస్థ చిన్నపిల్లల కోసం ఓ వ్యాక్సిన్ను తయారుచేస్తోందని కేంద్రం హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. ట్రయల్స్ పూర్తికాగానే వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెడతామని కేంద్రం హైకోర్టుకు తెలిపింది.
ట్రయల్స్ పూర్తయ్యాక ఈ వ్యాక్సిన్కు సంబంధించిన అనుమతులు జారీచేస్తామని కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. కానీ చిన్నపిల్లలకు మాత్రం వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో చిన్నపిల్లలకు వ్యాక్సిన్ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది.
Also Read : థర్డ్వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!