కరోనా సెకండ్ వేవ్ టైంలో ఆక్సిజన్కు ఎంత డిమాండ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయానికి ఆక్సిజన్ అందక ఎంతోమంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మన దేశంలో కరోనా సెకండ్వేవ్ తీవ్రతతో చాలా మందికి ఆక్సిజన్ అవసరం అయ్యింది. త్వరలో థర్డ్వేవ్ వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సెకండ్వేవ్ను దృష్టిలో ఉంచుకొని .. ప్రభుత్వాలు ఏ మేరకు ఏర్పాట్లు చేశాయో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ఒకరు ఆక్సిజన్ బాటిల్ను రూపొందించారు. దీనిని పాకెట్ లో కూడా పెట్టుకోవచ్చని ఆయన చెబుతున్నారు. డాక్టర్ సందీప్ పాటిల్ ఈ ఆక్సిజన్ బాటిల్ను రూపొందించారు. దీని ధరను రూ. 499 గా నిర్ధారించారు. కరోనా టైంలో చాలా మంది ఆక్సిజన్ సిలిండర్లు మోసుకొని ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లారు. వాటిని తీసుకెళ్లడం చాలా కష్టం. దీంతో డాక్టర్ సందీప్ పాటిల్ ఈ ప్రయత్నం చేశారట.
ఈ బాటిల్ను మాములూ శానిటైజర్ బాటిల్ లాగానే జేబులో పెట్టుకొని వెళ్లొచ్చని ఆయన చెబుతున్నారు. అత్యవసర సమయంలో రోగిని ఆస్పత్రి వరకు తీసుకెళ్లేందుకు ఈ ఆక్సిజన్ బాటిల్ ఉపయోగపడుతుందని ఆయన అంటున్నారు. ఈ స్పిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ ఆక్సిజన్ బాటిల్ను తయారుచేసినట్టు ఆయన అన్నాడు. ఇది ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. వచ్చాక దీని పనితీరు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఇదో గొప్ప ప్రయత్నం అని మెచ్చుకుంటున్నారు నిపుణులు.
Also Read
థర్డ్వేవ్ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన