ప్రపంచంలో ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరిగిపోతోంది.. టెక్నాలజీ పెరగడంతోపాటు అంతే సంఖ్యలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో వాల్లు చేసే ఘోరాలు లైవ్గా పెడుతున్నారు. తాజాగా జరిగిన ఉదంతం వింటే మనిషి రోజు రోజుకీ ఎంత నీచ స్తితికి వెల్తున్నాడో అర్థమవుతుంది. పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని ప్రైవసీ అన్నది లేకుండా పోయిన ఈ రోజుల్లో.. నమ్మిన వ్యక్తి ఏ మాత్రం తేడా చేసినా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఉదంతం చెబుతుంది.
పరాయి వాల్లు చేస్తే ఏదో అనుకోవచ్చుకానీ కట్టుకున్న భర్తే చివరికి తన భార్యతో ఏకాంతంగా గడిపిన దృష్యాలను బట్టబయలు చేశారు. హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ చేసిన ఉదంతం ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్గా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే లక్షల్లో జీతాలు. అయినా కూడా డబ్బుకోసం నీచపనులు చేయడానికి కూడా వెనకాడటంలేదు. ఈజీమనీ కోసం ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎవరూ ఊహించనివిధంగా నీచానికి దిగజారాడు. సులభంగా డబ్బులు సంపాదించొచ్చన్న ఉద్దేశంతో.. భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాల్ని అశ్లీల వెబ్ సైట్ కి అమ్మకానికి పెట్టాడు. ఈ విషయాన్ని భార్యకు తెలీకుండా జాగ్రత్తపడి.. అమాయకంగా నటించాడు. చివరికి భార్య ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కాడు.
తమ ఏకాంత జీవితానికి సంబంధించిన వీడియోలు అశ్లీల వెబ్ సైట్లలోకి ఎక్కాయన్న విషయం తెలుసుకున్న బాధితురాలు అవాక్కయ్యింది. ఆలస్యం చేయకుండా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. భర్త ల్యాప్ టాప్ నుంచే వీడియోలు వెళ్లినట్లు ఐపీ నంబరు ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇదంతా కట్టుకున్నోడే ఈ పాడు పని చేసిన విషయాన్ని తేల్చటమేకాకుండా… అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈజీమనీ కోసం అశ్లీల వెబ్ సైట్లను ఆశ్రయించినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టించటమే కాదు.. ఇది తెలిసిన వారంతా అసహ్యించుకుంటున్నారు. ఇతడు చేసిన పనివల్ల భార్యాభర్తలు ఒకరిమీద ఒకరికి నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. టెక్నాలజీ వచ్చిన తర్వాత కట్టుకున్న భార్యకే రక్షణ లేకుండా పోతోదంటే …ఈ టెక్నాలజీ మనిషిని ఎతం నీచ స్తాయికి దిగజారుస్తుందో ఈ ఉదంతమే నిదర్శనం.
Related