కోలీవుడ్ హీరో ప్రశాంత్ అందరికి తెలిసిన హీరోనే.. అదేనండి జీన్స్ మూవీలో నటించి మెప్పించిన ప్రశాంత్. కోలీవుడ్ లో ఎన్నో సినిమాలో నటించిన ఈ స్టార్ హీరో అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాడు. ఈయన 2005లో గృహలక్ష్మి అనే మహిళను పెళ్లి చేస్కున్నారు. వీరిద్దరు కొంత కాలం అనందగా సంసారం చేశారు.
వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ టైంలో ప్రశాంత్కు తన భార్య గృహలక్ష్మి గురించి షాకింగ్ విషయం తెలిసింది. గృహలక్ష్మికి తాను పెళ్లి చేసుకోక ముందే మరో వ్యక్తితో వివాహం అయ్యిందని, ఆ విషయాన్ని ఆమె చెప్పకుండా తనను మోసం చేసిందన్నాడు.
ఆ వ్యక్తితో ఇప్పటికి కూడా అక్రమ సంబంధం ఉందని.. ఆరోపణలతో చెన్నై ఫ్యామిలీ కోర్టులో ప్రశాంత్ విడాకులకు అప్లై చేయడం జరిగింది. ప్రశాంత్ వాదనతో ఏకీభవించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే ప్రశాంత్ను తాను మోసం చేయలేదు అని, తాను ప్రశాంత్తో జీవితం పంచుకుంటాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె విడాకుల తీర్పును సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లింది. పై కోర్టులో కూడా ఆమె నుండి ప్రశాంత్ విడిపోవడాన్ని సమర్ధించింది.
{youtube}ZhPviiuBaXc{/youtube}
Related