నటి ప్రియామణి జోరు పెంచింది. అందంతో పాటు తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ భామ.. రీసెంట్ గా భామా కలాపంతో మరో సక్సెస్ అందుకుంది. ఆహా ఓటీటీలో ఇటీవలే విడుదలైన భామాకలాపం వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పెళ్ళైనకొత్తలో, గోలీమార్, శంభో శివ శంభో, యమదొంగ మొదలగు తెలుగు చిత్రాలలో నటించింది.
తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళీ, తమిళ్ భాషల్లో నటించింది. ఇక 2017లో ముస్తఫా రాజ్ను వివాహం చేసుకున్న ప్రియమణి.. ఆ తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోతుంది. గతేడాది నారప్పతో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ తాజాగా భామాకలాపం సక్సెస్ తో రెమ్యునరేషన్ పెంచేసిందన్న టాక్ ఫిలిం నగర్ లో జోరుగా నడుస్తోంది.
ఈ వెబ్ సిరీస్ కి గాను ప్రియమణి రోజుకు దాదాపు 1.5 లక్షల రూపాయలు తీసుకుందని, ఇప్పుడు ఏకంగా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు డిమాండ్ చేస్తోందట.. ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న విరాటపర్వం సినిమాలో ప్రియమణి కీలకపాత్రలో నటిస్తోంది.