లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్సరైజ్ చేసిన బాలీవుడ్ భామ దిశా పటానీ బంపర్ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. విజయ్ 66వ చిత్రం కోసం దిశా పేరు పరిశీలించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందాన్న, కీర్తి సురేష్, తమన్నా వంటి నటీమణుల పేర్లను పరిశీలించి చివరకు దిశా పటానీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ఈ సినిమాకు S.S.తమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్నది తేలాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ బీస్ట్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.
ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?