- Advertisement -
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల విచారణ వేగంవంతమైంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక నిందితుని కోసం గాలిస్తున్నారు. మే 29న జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితులంతా రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన వారు కావటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విపక్షాల ఆందోళనతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో తవ్వేకొద్దీ ఈ ఘటనకు సంబంధించిన ఆశ్చర్యం గొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం అనంతరం నిందితులు మొయినాబాద్లోని ఓ రాజకీయ నేత ఫాంహౌజ్లో మద్యం సేవించినట్లు తెలుస్తోంది.
అనంతరం అక్కడ్నుంచి వేర్వేరు చోట్లకు పరారయ్యారు. ఆ ఫాం హౌజ్ వెనుకనే ఇన్నోవా కారును దాచిపెట్టిన నిందితులు.. ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. కారుపై ఎమ్మెల్యే, ప్రభుత్వ స్టిక్కర్లు తొలగించారు.
Also Read