Sunday, May 19, 2024
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం- పనస రవికుమార్

- Advertisement -

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఓవైపు మునుగోడు ఉపఎన్నిక ప్రచారాల హోరు జరుగుతుంటే.. మరో వైపు పార్టీలు మారే నేతలు జంపింగ్ జపాంగ్ షురూ చేశారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో రవి కుమార్ పనస, శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవి పనస సంతోషం వ్యక్తం చేశారు. మునుగోడులో టి. ఆర్. ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం అని పనస రవికుమార్ అన్నారు.

ఇంకా రవి పనస, డాక్టర్‌ శ్రవణ్‌ దాసోజు మాట్లాడుతూ… తెలంగాణ, భారతదేశానికి గుండెలాంటిది. అలాంటి తెలంగాణని తెచ్చిన టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ… శ్రవణ్, రవి పనస పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వారిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నా అన్నారు.

ఇవి కూడా చదవండి

బీజేపీకి పవన్ పంచ్ గట్టిగా తాకిందా ?

జగన్ కు మరోసారి షాక్ ఇచ్చిన షర్మిల !

కాంగ్రెస్, వైసీపీతో పొత్తు.. మరి జగన్ ఒప్పుకుంటారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -