Sunday, May 19, 2024
- Advertisement -

టీ20 వరల్డ్ కప్..వారిద్దరూ డౌటే?

- Advertisement -

వచ్చే ఏడాది జూన్ నుండి టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్‌ని తృటిలో చేజార్చుకున్న టీమిండియా ..టీ20 వరల్డ్ కప్‌ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ సారి జరిగే టీ 20 వరల్డ్ కప్‌కి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీ 20 వరల్డ్ కప్‌కి డౌటేనని తెలుస్తోంది.

ఎందుకంటే ప్రస్తుతం సూర్య కుమార్‌ని టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ.ఆసీస్‌తో సిరీస్‌ని కైవసం చేసుకున్న టీమిండియా..దక్షిణాఫ్రికా టూర్‌కి వెళ్లనుంది. ఈ సిరీస్‌కు సూర్యనే సారధిగా వ్యవహరించనున్నాడు. ఇక 2019 వరల్డ్ కప్ తరువాత టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు… వన్డేలకు కూడా దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న టీ20 టీమ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. రింకూ సింగ్ రూపంలో స్టార్ ఫినిషర్ దొరకగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు.అందుకే సౌతాఫ్రికాతో జరిగే టీ20 మ్యాచ్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని విశ్రాంతిని ఇచ్చింది బీసీసీఐ. సో మొత్తంగా టీ 20 వరల్డ్ కప్‌కు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ దూరం కావడం ఖాయమని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -