కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు షాక్ తగిలింది. బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరధ్ మీద పోక్సో కేసు నమోదు అయింది. 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు.
మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌజ్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
BNS 74,75 సెక్షన్లతో పాటు, సెక్షన్ 11 r/w12 పోక్సో చట్టం కింద బండి సాయి భగీరధ్ మీద కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు.
బండి సంజయ్ కొడుకు కారణంగా రెండు సార్లు తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.
కేసు నుండి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి సంజయ్ కొడుకు తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు బాలిక తల్లిదండ్రులు.
అయితే బండి సంజయ్ వర్గం వెర్షన్ మాత్రం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారని.. 50 వేల రూపాయలు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు..
ఏ తప్పు చేయనప్పుడు 50 వేల రూపాయలు ఇవ్వడం ఏంటని, ఈ వాదనలో పస లేదని అనుమానాలు మొదలయ్యాయి.
