- భోగికి టచ్ చేసి చూడు సినిమా విడుదల
సంక్రాంతి పండుగకు సినిమాలు భారీగా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే పెద్ద హీరోలు ఫిక్సయ్యాయి. పవన్కల్యాణ్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహాతో వస్తామని ఎప్పుడో ప్రకటించారు. ఇక తాము కూడా వస్తామని పలువురు హీరోల సినిమాలు ప్రకటించాయి. డబ్బింగ్ సినిమాలుగా సూర్య గ్యాంగ్, విశాల్ అభిమన్యుడుగా వస్తామంటున్నారు. ఇక వీరితో పాటు తాను ఉన్నానంటూ రవితేజ వస్తున్నాడు. ‘టచ్ చేసి చూడు ‘ అనే సినిమాతో సంక్రాంతికి వస్తానంటున్నాడు. అయితే సంక్రాంతి పండుగ రవితేజకు బాగా కలిసొచ్చింది. కృష్ణ, మిరపకాయ్ లాంటి సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయాలు పొందాయి. దీంతో సంక్రాంతికి తన సినిమా విడుదల చేయాలని చిత్రబృందం ఆసక్తిగా ఉంది.
అయితే పవన్, బాలకృష్ణల మధ్య పోటీని తట్టుకోగలడా అని తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వచ్చి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చేలా ఉంది. రాజా ది గ్రేట్ సినిమా విజయంతో రవితేజ తన తర్వాతి సినిమాపై చాలా ధీమాగా ఉన్నాడు. ఎంత పోటీ ఉన్నా తనకు ఓ అభిమాన వర్గం ఉంటుందనే నమ్మకంతో ఉన్నాడు. దీంతో ఈ సినిమాను భోగి పండుగ నాడు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే సంక్రాంతికి మాత్రం థియేటర్ల కొరత మాత్రం తప్పేట్టు లేదు. అయితే ఈ సినిమా కొన్న బయ్యర్లు సంక్రాంతికి విడుదల చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.