Monday, May 20, 2024
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ భారీ చోరి జరిగింది. ఇంట్లో ఉంచిన బంగారు, వజ్రాల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో రోజా నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉంది. దీన్ని గమనించిన దొంగలు, పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడ్డారు.

ఇంట్లో తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చునని రాయదుర్గం పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే రోజా నివాసానికి చేరుకొని పరిశీలించారు.చోరీ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -