- Advertisement -

విచిత్రమైన దొంగ..చోరి చేసి ఏంచేశాడో తెలుసా!

- Advertisement -

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో విచిత్రమైన దొంగ. తాను చోరికి పాల్పడిన ఇంట్లో ఓ మెస్సేజ్ రాస్తూ పోలీసులకు సవాల్‌గా మారాడు. ఎందుకంటే లక్షల రూపాయల విలువైన వస్తువులు దోచుకెళ్లిన ఈ శాతిర్ దొంగ, లిప్‌స్టిక్‌తో గోడపై రాసిన మాటలు చదివి పోలీసులకూ ఆశ్చర్యం కలిగించింది.

గత శనివారం జైసల్మేర్‌లోని ఐజీఎన్‌పీ కాలనీలో నివసిస్తున్న సహాయక ఇంజనీర్ సోహన్ జాంగిడ్ ప్రభుత్వ నివాసంపై దొంగలు దాడి చేశారు. ఆ ఇంటి నుంచి ల్యాప్‌టాప్, టీవీ, పెర్ఫ్యూమ్, దుస్తులు సహా అనేక విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇంట్లో ఉన్న లిప్‌స్టిక్‌తో గోడపై పెద్ద అక్షరాల్లో…ఇంట్లో మద్యం ఉంచితే, దానికి తోడు ఆలూ చిప్స్ కూడా ఉంచాలి అని రాశాడు.

అంతేకాదు, పోలీసులను ఎద్దేవా చేస్తూ..థానాలో ఫిర్యాదు చేస్తే సమయం వృథా అవుతుంది… రిపోర్ట్ చేయొద్దు. నువ్వు నన్ను మర్చిపో, నేను నిన్ను మర్చిపోతాను అని కూడా రాశాడు. గోడపై రాసిన సందేశంలో తనను తాను “బిహారీ బాబు”గా పేర్కొన్నాడు. ఇంటి యజమాని అన్నం తిన్నానని, బాగా నచ్చిందని, కానీ పరిస్థితుల కారణంగా మొదటిసారి చోరీ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. చివర్లో “ధన్యవాదాలు” అని రాసి అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే సోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలను సేకరించారు. దొంగలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -