అత్యాధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్ష విజయవంతంం అయ్యింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ అణు క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించగా, ఇది లక్ష్యాన్ని చేధించిందని అధికారులు వెల్లడించారు.గత సంవత్సరం నవంబర్ లో భారత వాయుసేన యుద్ధ విమానం సుఖోయ్ – 30 నుంచి విజయవంతంగా పరీక్షించిన బ్రహ్మోస్ క్షిపణికి ఇది లేటెస్ట్ వర్షన్. గతంలో 2.8 నుంచి 4.0 మాక్ ల వేగంతో (ఒక మాక్ అంటే గంటకు 1,234.8 కిలోమీటర్ల వేగం) దూసుకెళ్లే క్షిపణి వేగాన్ని 5.0 మాక్ లకు పెంచారు. అంటే గంటకు ఈ క్షిపణి 7,170 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది.
2017లో దుబాయ్ ఎయిర్ షోలో బ్రహ్మోస్ ను ప్రదర్శించిన వేళ, పలు దేశాల అధికారులు దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. తాజా క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది మీడియం రేంజ్ రామ్జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. నేలపై నుంచి, నీటి నుంచి, గాల్లో నుంచి కూడా ప్రయోగించవచ్చు. భారత ప్రభుత్వ డీఆర్జీవో, రష్యన్ ఫెడరేషన్ ఎన్పీఓ ల ఉమ్మడి వెంచర్ ఈ క్షిపణులను తయారు చేస్తోంది.
ఇండియాలోని బ్రహ్మపుత్రా నదిలోని మొదటి మూడక్షరాలతో పాటు రష్యాలోని మాస్కోవా నదిలోని తొలి మూడక్షరాలనూ కలిపి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. ప్రపంచంలోనే బ్రహ్మోస్ క్షిపణులు అత్యంత వేగంగా ప్రయాణించే యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులుగా నిలిచాయి. తొలి తరం బ్రహ్మోస్ 2006లో తయారైంది.
Formidable Supersonic Cruise Missile #BrahMos was successfully flight tested at 8:42 AM today at Pokhran test range, Rajasthan.
The precision strike weapon with Indian-made seeker flew in its designated trajectory and hit the target with pin-point accuracy.@PIB_India @MIB_India— Raksha Mantri (@DefenceMinIndia) March 22, 2018
Smt @nsitharaman congratulates @DRDO_India , the Armed Forces and Defence Industry for the successful flight test of the Supersonic Cruise Missile #BrahMos. The successful test will further bolster our national security.@PIB_India @MIB_India @SpokespersonMoD https://t.co/v3mQEovNvC
— Raksha Mantri (@DefenceMinIndia) March 22, 2018