క్లాస్ అండ్ మాస్… తేడా లేకుండా సినిమాలు చేస్తున్నాడు.. పరాజయాలు మూటగట్టుకుంటున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. తన బ్యాడ్లక్కో.. ఏమిటో గానీ పెద్ద దర్శకులతో సినిమాలు తీసినా ఫ్లాపు మూటగట్టుకుంటున్నాడు. అయినా కూల్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న తేజూ మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఫీల్గుడ్ మూవీస్ను తెరకెక్కించే దర్శకుడు కిశోర్ తిరుమల. ఇప్పుడు అతడి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు పేరు పెట్టేశారు. హీరోయిన్ను ఎంపిక చేశారు. సాయి పక్కన మేఘా ఆకాశ్ను హీరోయిన్గా ఎంపిక చేయగా సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారని సమాచారం. ఈ సినిమా జూలైలో సెట్స్పైకి వెళ్లి డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం సాయిధరమ్తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.