రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం విడుదల రోజు నుండే రికార్డులతో దూసుకుపొతుంది.ఇప్పటికే తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. ఇప్పడు మరో రికార్డు రంగస్థలం ఖాతాలో చేరింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. గత నెల 30న రిలీజ్ అయిన రంగస్థలం ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ సత్తా చాటుతోంది.రంగస్థలం తరువాత పెద్ద సినిమాలే లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.
ఛల్ మోహన్ రంగ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు రిలీజ్ అయినా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోవటంతో రంగస్థలం జోరు కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమా 200 కోట్ల మార్క్ను సాధిస్తుందంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ, ప్రకాష్ రాజ్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే.ఈ వారంలో మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నాడు.అప్పుడైనా చిట్టి బాబు జోరు తగ్గుతుందేమో చూడాలి.