- Advertisement -
ఇప్పటికే పలు సందర్భాల్లో తన ఔదర్యాన్ని చూపిన హిరో విశాల్ తాజాగా మరో మంచి పని చేయడానికి సిద్ధమయ్యాడు. అది కూడా తెలుగు రాష్ట్రాల రైతుల కోసం. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు.
ఇటీవల విడుదలైన ఆయన సినిమా ‘అభిమన్యుడు’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘అభిమన్యుడు’ సాధించిన వసూళ్లలో కొంత లాభాన్ని రైతులకు పంచాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి టికెట్పై ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తానని చెప్పాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి వారంలో రూ.12 కోట్లు వసూలు చేసింది.