హీరోయిన్ రెజీనాకు హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.పూర్తి వివరాలలోకి వెళ్తే….తాజాగా ఇండియా మొత్తం కికి ఛాలెంజ్తో షేక్ అవుతుంది.ఈ కిక్ ఛాలెంజ్ ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ…. ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాట బాగా పాపులర్ అవడంతో హాలీవుడ్ నటుడు షిగ్గి ‘కికి ఛాలెంజ్’ పేరుతో సోషల్ మీడియాలో ఛాలెంజ్ ను ప్రారంభించారు. దీనికి అంతర్జాతీయ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. దులుతున్న కారు నుండి కిందకి దిగి కారు నిదానముగా కదులుతుండగా దానితో పాటు డాన్స్ చేసి మళ్ళీ కారులోకి రావాలి. తాజాగా రెజీనా ఈ ఛాలెంజ్ ను స్వీకరించి కదులుతున్న కారులో నుండి దిగి డాన్స్ చేసింది.
ఆ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది రెజీనా.దీనిపై మన పోలీసులు రియాక్ట్ అయ్యారని సమాచారం.నడుస్తున్న కారు నుండి దిగి డాన్స్ చేయడం ప్రమాదకరమని, మీ వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఒక హీరోయిన్గా మిమ్మల్ని ఎంతోమంది ఫాలో అవుతుంటారని కాబట్టి ఇలాంటివి చేయకపోవడమే మంచిదని రెజీనాను పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తుంది. కికి ఛాలెంజ్ను హీరోయిన్ ఆదా శర్మా కూడా చేసింది.కాకపోతే ఆగి ఉన్న కారు పక్కన ఆదా శర్మ డ్యాన్స్ వేసింది.ఇక కికి ఛాలెంజ్ను చూస్తు చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చకున్నారని పోలీసులు తెలుపుతున్నారు.కాబట్టి ఇలాంటి రిస్క్ ఛాలెంజ్లను ఎవరు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.