బిగ్బాస్ రెండో సీజన్లో గురువారం జరిగిన 82వ ఎపిసోడ్లో పలు విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి.మర్డర్ మిస్టరీ టాస్క్ ముగియగానే,సీక్రెట్ టాస్క్లో విజయం సాధించిన గీతా తనకు ఇచ్చిన స్పెషల్ పవర్స్ ద్వారా ఈ సీజన్ మొత్తం కౌశల్ను ఎలిమినేషన్కు నామినేట్ చేసింది.ఆ తరువాత జరిగిన పరిణమాలలో గీతా ..గణేష్ దగ్గరికి వెళ్లి ఏడ్చింది.గీతాతో పాటు శ్యామల,దీప్తిలు కూడా గణేష్ దగ్గరికి వెళ్లీ కన్నీరు పెట్టుకున్నారు.మొదట వీళ్లు ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికి అర్థం లేదు.తరువాత గీతా మాట్లాడుతు…పాపం గణేష్ చాలా మంచోడు,గణేష్ ఇనోసెంట్,గణేష్ సాఫ్ట్ అని గణేష్ ఒక్కసారి అయిన బిగ్బాస్ ఇంటి కెప్టెన్ అయితే బాగుంటుందని ఈ ఆడ గ్యాంగ్ మొత్తం చెప్పుకొసాగారు.
అయితే కెప్టెన్సీ రేసులో వీరు ఎవ్వరు కూడా గణేష్ పేరు చెప్పలేదు.చాలామంది నూతన్ నాయుడు,రోల్ రైడా,తనీష్ల పేర్లు చెప్పారు.మరి ఎందుకు ఈ ఆడ గ్యాంగ్ వెళ్లి గణేష్ దగ్గర ముసలి కన్నీరు కారుస్తున్నారో అర్థం కావడం లేదు.వీరిలో గీతా ఒక అడుగు ముందుకేసి గణేష్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో ఉంటే చాలా బాగుండేదని అభిప్రాయపడింది.సడన్గా ఈ ఆడ గ్యాంగ్కు ఎందుకు గణేష్ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు.ఇక వారం గణేష్తో పాటు,కౌశల్,సామ్రాట్,నూతన్ నాయుడు,అమీత్లు ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు.మరి వీరిలో ఎవరు బిగ్బాస్ను వదిలి బయటికి వస్తారో చూడాలి.