ప్రేమలో మొదలయిన అనుమానం ఘోరానికి దారితీసింది. ప్రియురాలు వేరే వ్యక్తితో చనువుగు ఉంటుందన్న అనుమానంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారి…ప్రియురాలి గొంతు కోసం కిరాతకంగా హత్యచేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని పోలీస్స్టేష్న్కు వెల్లి లొంగిపోయాడు.
ఈ కిరతక సంఘటన కర్నాటకలోని కంచర్లపల్లిలో చోటు చేసుకుంది. నివాసపురం పట్టణం గఫార్ఖాన్ వీధికి చెందిన అజీజ్ (27) మొబైల్ షాపు నడుపుతున్నాడు. ఇతనికి గతంలోనే పెళ్లయింది. అయితే బెంగళూరుకు చెందిన అయూబ్ఖాన్ కూతురు రోషన్ఖానం (24)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయితే తనతోనే కాకుండా మరొకరితో కూడా ఆమె చనువుగా ఉంటోందని అజీజ్ అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు.చింతామణి తాలుకాలోని మురగమల్లా దర్గాలో పూజలు చేద్దామని నమ్మబలికి పిలుచుకొచ్చాడు. దర్గాను దర్శించుకున్నాక గ్రామ శివార్లలోని మామిడి తోపు షెడ్లోకి వెళ్లారు. అక్కడ అజీజ్ వేటకొడవలితో ఆమె గొంతు నరికి తల వేరుచేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని బైక్పై శ్రీనివాసపురం స్టేషన్లో లొంగిపోయాడు.
