బాలీవుడ్ మొత్తం పెళ్లిళ్లతో కళకళలాడుతుంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా,దీపిక పదుకునేలు ఇటీవలే పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.దీపిక హీరో రణ్వీర్ను పెళ్లి చేసుకోగ,ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ను పెళ్లాడింది.ఇక దీపిక – రణ్వీర్ జంట తమ హానీమూన్ని వాయిదా వేసుకుని తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ జంట మాత్రం హానీమూన్ని వెంటనే ప్లాన్ చేసుకున్నారు.ప్రియాంక చోప్రా – నిక్లు తమ హానీమూన్ కోసం ఓ గ్రామం మొత్తన్ని బుక్ చేసుకున్నారట. ఈ జంట తమ హానీమూన్ను లండన్లో ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది.
లండన్లోని ఓ దీవీలో ఇలా హానీమూన్స్ కోసం ప్రత్యేకంగా ఓ గ్రామంలా డిజైన్ చేసి అద్దెకు ఇస్తారట.ఇలా హానీమూన్ కోసం వచ్చిన వారి దగ్గరి నుంచి భారీగానే వసూలు చేస్తారు నిర్వహాకులు.అయితే తమ హానీమూన్ కోసం ఏకంగా ఆ గ్రామం మొత్తన్ని బుక్ చేసుకున్నరు ఈ కొత్త జంట.ఇలా హానీమూన్కు ఆ గ్రామం మొత్తం బుక్ చేసుకున్న మొట్టమొదటి జంట వీరిద్దరే.తమ ఏకాంతానికి ఎవరు అడ్డం ఉండకూడదని భావించి ఇలా విలేజ్ మొత్తన్ని తీసుకున్నారని అంటున్నారు నెటిజన్లు.ఇక ఈ గ్రామంలో కొత్త జంటలకు కావల్సిన సౌకర్యాలతో పాటు, ప్రీడమ్ ఉండుందని అక్కడికి వెళ్లిన వారు చెబుతున్నారు.అయితే వీరు హానీమూన్కు ఎప్పుడు వెళ్తారనేది తెలియాల్సి ఉంది.