- Advertisement -
భూకంపానికి ఫిలీప్పీన్స్ చిగురుటాకులా వణికింది. దక్షిణ ప్రాంతంలోని మిందానావో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రానికి 300 కి.మీ. దూరంలో ఉన్న తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది పసిఫిక్ సునామీ కేంద్రం.
సునీమీ హెచ్చిరికల నేపధ్యంలో అక్కడి అధికారులు అప్రమత్త మయ్యారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సునామీ హెచ్చరికలను బట్టి సురక్షిత ప్రాంతాలకు వెల్లాలని అక్కడి ప్రజలకు సూచించారు అధికారులు. ఫిలిప్పీన్స్తోపాటు ఇండోనేషియాలోని కొన్ని ద్వీపాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.