హార్థిక్, రాహుల్పై ఖటిన చర్యలు తీసుకుంది బీసీసీఐ. వారిద్దరి మీద రెండు వన్డే మ్యాచ్ల నిషేధం విధించింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు మహిళలగురించి అసభ్యంగా మాట్లాడారు. వీరు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. అలాగే శృంగారం గురించి కూడా కొన్ని బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. హార్థిక్తో పాటు రాహుల్ కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు.
విమర్శల నేపధ్యంలో 24 గంటల్లోగా వివరన ఇవ్వాలని బీసీసీఐ షోకాజు నోటీసులు జారీ చేసింది. విమర్శల నేపథ్యంలో పాండ్య ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. అయితే వీరు ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యంగా లేదని , క్షమాపణలు ఆ తప్పును కప్పిపుచ్చలేవని వారిద్దరి మీద రెండు వన్డే మ్యాచ్ల నిషేధం విధించాలని పాలకుల కమిటీ(సీఓఏ) ఛైర్మన్ వినోద్ రాయ్ గురువారం సూచించారు. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీకి పంపిన మెయిల్లో ఈ ప్రతిపాదన చేశారు.
దీంతో బీసీసీఐ ఈ ఇద్దరు క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంది. వీరిద్దరిని రెండు వన్డేల పాటు సస్సెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్ ఆతిథ్య జట్టుతో జరిగే రెండు వన్డేల్లో పాల్గొనే అవకాశం లేదు.