- Advertisement -
వైసీపీ కుప్పం అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుప్పంనుంచి చంద్రబాబుపై వైసీపీ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారంకూడా చేయలేదు. ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న చంద్రమౌళిని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.ధైర్యంగా ఉండాలనీ, రాజమౌళి త్వరగా కోలుకుంటారని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.