సెమీఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమిని అభిమానులు జీర్నించుకోలేక పోతున్నారు. కొందరు అభిమానులు టీమిండియాకు సపోర్ట్ చేస్తుంటె మరికొంత మంది విమర్శలు చేస్తున్నారు.క్రీజులో ధోని ఉన్నంత వరకు విజయంపై ధీమాతో ఉన్న అభిమానులు…ధోని రనౌట్ అవడంతో ఒక్క సారిగా అభిమానులు మూగబోయారు. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేక విజయనగరం జిల్లాలో ఓ అభిమాని గుండెపోటుతో మరనించిన సంఘటన మరువక ముందే ధోని రనౌట్ను చూసి తట్టుకోలేక మరో అభిమాని గుండెపోటుతో మరణించారు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటన కోల్కతాలో జరిగింది.
రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ తొలి బంతికే ధోనీ సిక్స్ కొట్టడంతో అభిమానులు మురిసిపోయారు. అదే ఓవర్ మూడో బంతికి రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించి ధోనీ రనౌట్ కావడంతో అభిమానులు గుండెలు పగిలిపోయాయి.
కోల్కతాకు చెందిన శ్రీకాంత్(33) ధోనీకి వీరాభిమాని. బుధవారం కివీస్-భారత్ సెమీస్ మ్యాచ్ను మొబైల్ ఫోన్లో వీక్షిస్తున్నాడు. భారత్ ఆఖరి రెండు ఓవర్లలో సాధించాల్సిన పరుగులు ఎక్కువగా ఉన్నప్పటికీ ధోని ఉండటంతో విజయం ఖాయమని భావించాడు. అయితే ధోని రనౌట్ కావడంతో బాధతో అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తీవ్ర భావోద్వేగాన్ని తట్టులోకే చనిపోయాడని అక్కడి డాక్టర్లు వెల్లడించారు.