Saturday, May 4, 2024
- Advertisement -

ఆన్ లైన్ గేమ్ కు బానిస అయిన కొడుకు తండ్రిని ఏంచేశాడంటె…?

- Advertisement -

ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడిన యువకులు బానిసలయి ఆత్మహత్యలు చేసుకంటున్న సంఘటనలో అనేకం జరిగాయి. పబ్‌జీ పిచ్చి జనాల్లో ఎంతగా ముదిరిపోయిందో అందరికి తెలిసిందే. తాజాగా పబ్ జీ గేమ్ కు అలవాటు పడిన యువకుడు కన్న తండ్రినే కిరాతకంగా హతమార్చాడు.కుటుంబబంధాలను మంటగలిపిన ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెల్తే…నగరానికి చెందిన రఘువీర్ కుమార్ పబ్ జీ గేమ్ కు బానిసయ్యాడు. 24 గంటలు పబ్‌జీ ప్రపంచంలోనే ఉంటూ.. పబ్‌జీ కోసమే ఆలోచిస్తూ నిద్రాహారాలు మానేస్తున్నకొడుకుని తండ్రి శంకర్ పబ్జీ గేమ్‌ను ఆడకూడదని ఎంత చెప్పినా కొడుకు వినిపించుకోక పోవడంతో ఫోన్ ను లాక్కున్నాడు. దీంతో తండ్రిపై ధ్వేసం పెంచుకున్న రఘువీర్ అతికిరాతకంగా హత్య చేశాడు.ఏకంగా తండ్రి తలను నరికి విడదీసి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.

తెల్లవారు జామున జరిగిన ఘటనలో తండ్రి మృతదేహాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చెప్పిన పాపానికి తండ్రిని కన్నకొడుకే అతి కిరాతకంగా హత్య చేశాడు.ఏకంగా తండ్రి తలను నరికి విడదీసి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -