చాన్నాళ్ల తర్వాత పవర్ఫుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్బాబు కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు. ఆ సినిమానే ‘గాయత్రి’. మంచు విష్ణు, శ్రియ, అనసూయన, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్బాబు పాత్ర రాయలసీమ రామన్న చౌదరి తరహాలో ఉండనుందని తెలుస్తోంది. అందుకోసం ఈ పాత్రలో స్పెషల్గా కనిపించాలని తహతహలాడుతున్నాడు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేకప్ వేసుకున్నారు.
గతంలో రజనీకాంత్, కమల్హాసన్ రోబో, దశావతారం కోసం వేసిన మేకప్లను ఈసారి మోహన్బాబు వేసుకున్నారు. దీన్ని ప్రొథెస్టిక్ మేకప్ అని అంటారు. గాయత్రి సినిమాలో రెండు పాత్రల్లో మోహన్బాబు ఉండడంతో ఒక పాత్ర కోసం ఈ ప్రొథెస్టిక్ మేకప్ వేసుకుని పాత్రకు తగ్గట్టు తయారయ్యారు. ముఖమంతా రంగులు, క్రీములు అద్దుకొని కొన్ని నిమిషాల పాటు అలా ఉన్నారు. ఇలా మేకప్ వేస్తున్నవీడియోను మంచు మనోజ్కుమార్ ట్విట్టర్లో విడుదల చేశారు.
మదన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదలవబోతోంది.వహించారు. మోహన్బాబు నిర్మాతగా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.