అనుష్క భాగమతి ట్రైలర్ విడుదల
బాహుబలిలో దేవసేనగా ఆకట్టుకున్న అనుష్క ప్రస్తుతం చేస్తున్న‘భాగమతి’ సినిమాతో బిజీగా ఉంది. అశోక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అరుంధతి స్థాయిలో ఉంది. ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. అనుష్క ఓ పక్కకు చూస్తున్నట్లు పోస్టర్తో ఆకట్టుకుంది. అయితే సోమవారం (జనవరి 8)న భాగమతి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో అనుష్క తన నటనతో ఆకట్టుకుంది.
“ఎవడు పడితే వాడు రావడానికి.. పోవడానికి ఇదేమన్నా పశువుల కొట్టారా.. ఇది భాగమతి అడ్డ రా.. లెక్క తేలాలి.. ఒక్కన్ని పోనివను..“ అని అనుష్క రౌద్రంతో తల విరబోసుకొని కనిపిస్తుంది. అనుష్క నిలబడ్డి ఉన్న స్టిల్ సూపర్గా ఉంది. సమాజ సేవ కోసం వచ్చిన ఓ యువతి పాత్రలో అనుష్క కనిపిస్తుంది. అనుష్కకు ఉన్ని ముకుందన్ (జనతా గ్యారేజ్ ఫేం) కనిపించి సహకరిస్తాడు. ఈ క్రమంలో ఉన్ని ముకుందన్ ప్రేమలో పడే అవకాశం ఉంది. అయితే ఈమె సహాయ పనులకు కొందరు అడ్డు పడతారు. ఈ సమయంలో ఏం జరిగిందనేదే ప్రత్యేకం. ఇదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. జయరాం కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా అనుష్కకు మరో అరుంధతిగా మారే అవకాశం ఉంది. మ్యూజిక్ ఎస్ ఎస్ తమన్ అందించాడు.