తాను కరోనాకు గురయ్యానని .. స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. అభిమానులు సైతం పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.
తాజాగా మెగాస్గార్ చిరంజీవి స్పందిస్తూ ‘మహేష్.. నువ్వు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సాధ్యమైనంత తొందరలోనే నిన్ను యాక్షన్ సీన్లలో చూడాలని ఉంది’ అని ట్వీట్ చేశారు. ‘ అన్నా నువ్వు త్వరగా కోలుకోవాలి . నీ కోసం ధైర్యాన్ని, నా ప్రార్థనలను పంపుతున్నాను’ అని జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్వీట్ చేశారు.
ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడిన మహేష్ బాబు మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. విశ్రాంతి తీసుకోవడం కోసం కొంతకాలం కుటుంబ సమేంతా స్పెయిన్ కు వెళ్లి ఇటీవలే నగరానికి వచ్చారు. ఇంతలోనే కరోనా బారిన పడ్డారు. కాగా మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ తన తదుపరి చిత్రం రాజమౌళితో చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయి.
ఢీ నుంచి సుధీర్, రష్మి అవుట్..కారణం అదేనా