Friday, May 17, 2024
- Advertisement -

ఆ కుర్ర హీరోతో పూరీ సినిమా బడ్జెట్ వంద కోట్ల రూపాయలు!

- Advertisement -

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కి సినిమా పిచ్చి చాలానే ఉంది. ఆయన స్వయంగా నిర్మాత కూడా.

అంతే కాదు.. ఒక హీరోయిన్ ను ద్వితీయ వివాహం కూడా చేసుకున్నాడు కుమారస్వామి. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనకు తొలి భార్యతో ఉన్న సంతానం నిఖిల్ గౌడ. తన తనయుడిని సినిమా హీరో చేయాలనేది కుమారస్వామి కల. అందుకోసం ఆయన చాలా రోజులుగా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఆయన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను పలుసార్లు సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

పూరి ఇప్పటికే కొన్ని కన్నడ సినిమాలు చేశాడు కాబట్టి.. దీంతో పూరీకి అక్కడ క్రేజ్ ఉంది. తన తనయుడిని హీరోగా పరిచయం చేసే సినిమాకు వంద కోట్ల రూపాయలు పెట్టడానికైనా కుమారస్వామి సిద్ధంగా ఉన్నాడట. కన్నడ చిత్ర పరిశ్రమలో కనీవినీ ఎరగని స్థాయిలో నిఖిల్ ఎంట్రీ ఉండాలనేది కుమారస్వామి భావన. అందుకే భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించి చాలా రోజులుగానే ప్రతిపాదనలున్నాయి. ఇప్పుడు వాటికి మళ్లీ ఊపు వచ్చింది. మరి ఇప్పటికే మెగా వారసుడిని పరిచయం చేసిన నేపథ్యం ఉంది పూరీకి. ఇప్పుడు కుమారస్వామి తనయుడిని కూడా తెరకు పరిచయం చేస్తాడో.. అదెలా ఉంటుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -