దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 47,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సెలబ్రెటీల వెంట పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా రంగానికి చెందిన వారికి రావడం కొంత మంది కన్నుమూయడం కూడా జరిగింది.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. కరోనా నిబంధనలను అనుసరించి ఇంట్లో ఐసోలేట్ అయినట్టు ఆయన ప్రకటించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాడని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. కాగా అమీర్ ను రీసెంట్ గా కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే గడచిన 24 గంటల సమయంలో 275 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,441కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,05,160 మంది కోలుకున్నారు. 3,68,457 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.