Friday, May 3, 2024
- Advertisement -

కేర‌ళ‌కు భారీ సాయం చేస్తున్న‌ లారెన్స్

- Advertisement -

కేరళలో భారీ వ‌ర్షాల కార‌ణంగా స‌ర్వ‌స్వం కోల్పొయిన సంగతి తెలిసిందే.వరద బాధితుల సాహాయార్దం సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు భారీ విరాళాలను ప్రకటించగా తాజాగా నటుడు రాఘవ లారెన్స్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి వార్తల్లో నిలిచాడు.వరద బాధితులకు నేరుగా సహాయం అందించాలని నిర్ణయించుకున్నాడు లారెన్స్.తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ”హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. నేను కేరళకు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. వరదల కారణంగా కేరళ ప్రజలు ఎదుర్కొన్న బాధలు నన్ను కలచివేశాయి.

ఇదంతా చూస్తున్నప్పుడు నాకు స్వయంగా వెళ్లి వారికి సహాయం చేయాలనిపించింది కానీ అన్ని ప్రాంతాలకు వెళ్లడం కష్టమని అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ప్రభుత్వం సహాయంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. కేరళ సీఎంని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నానని తెలిపాడు లారెన్స్.అంద‌రు త‌మ‌కు తోచిన స‌హాయం చేశారు,కాని విరాళం ఇవ్వడంతో పాటు నేరుగా సర్వీస్ చేయాలనుకుంటున్న లారెన్స్‌ని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -