- Advertisement -
సామాన్య మహిళలతో పాటు సినితారులకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు.హీరోయిన్ అమలాపాల్ పై లైంగిక వేధింపులు మరువక ముందే మరో నటిపై లైంగిక వేధింపులు వార్త భయటికి రావడంతో సిని తారలను కలవర పెడుతుంది.మలయా నటి సనూషా రైల్లో ప్రయాణిస్తుండగా ఓ కామాంధుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపింది.
తాను నిద్ర పోతున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఆంటోబోస్ అనే వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఇదే విషయాన్ని టీటీఈకి తెలియజేయడంతో రైల్వే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి కున్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సనూష తమిళంలో రేణిగుంట – భీమ – శశికుమార్ చిత్రం కొడివీరన్ లో నటించింది.