ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. రొటీన్ కథలను ఆడియన్స్ అస్సలు రిసీవ్ చేసుకోవడం లేదు. కథ, కథనంలో కొత్తదనం కోరుకుంటున్నారు. మాస్ మసాలా చిత్రాలు, రొటీన్ ఫార్ములాతో తెరకెక్కించే చిత్రాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. దీంతో దర్శకులు సైతం కొత్త తరహా చిత్రాలు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా చారిత్రక, జానపద, పౌరాణిక చిత్రాలు వీటితో పాటు బయోపిక్ ల మీద దృష్టి పెట్టారు. క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఎన్టీఆర్, జయ లలిత బయోపిక్లు , ఇంకా చాలా మంది ప్రముఖుల బయోపిక్లు తెరకెక్కిన విషయం తెలిసిందే. అన్ని భాషల్లోనూ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి హిట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా పై బయోపిక్ తీయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కపిల్ దేవ్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల సురేశ్ రైనాకు ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ మీ బయోపిక్ను తెరకెక్కిస్తే అందులో హీరోగా ఎవరు ఉండాలిని కోరుకుంటున్నారు? అంటూ యాంకర్ ప్రశ్నించాడు. దీనికి సురేశ్ రైనా .. తమిళ నటుడు సూర్య అయితే బాగుంటుందని బదులిచ్చాడు. ఇప్పటికే సూర్య .. ఆకాశమే హద్దురా అనే బయోపిక్లో నటించిన విషయం తెలిసిందే. మరి ఆయన రైనా బయోపిక్లో నటిస్తాడా? అన్నది వేచి చూడాలి. రైనా టీమిండియా తరపున 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు.
Also Read
ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ స్టార్ హీరోయిన్ ప్రయారిటీ బన్నీనే..!