Wednesday, April 24, 2024
- Advertisement -

రౌడీ హీరోకు బంపర్ ఆఫర్

- Advertisement -

సినిమా హీరోలు స్టార్ లుగా ఎదిగిన తర్వాత కమర్షియల్ ఆడ్స్ లో నటిస్తుంటారు. కొన్ని యాడ్స్ లో నటించడం ప్రెస్టీజియపస్ గా కూడా భావిస్తుంటారు. అటువంటి పాపులర్ యాడ్స్ లో థమ్స్ అప్ ఒకటి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ముందుగా ఈ యాడ్ లో నటించారు.

చిరంజీవి తర్వాత మహేష్ బాబు నటించారు. పర్వతం మీదున్న డ్రింక్ కోసం హెలికాప్టర్ లో వెళ్లే ఫీట్ న చేశారు మహేష్.
మామూలు ఆడ్స్ లాగా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఈ యాడ్ ఉంటుంది. ఒక హాలీవుడ్ యాక్షన్ రేంజ్ లో ఉండే ఈ యాడ్ లో చేసేందుకు చాలా మంది హీరోలు ఆసక్తిని చూపుతారు. హిందీలోనూ అబితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ కపూర్ వంటి వారు ఈయాడ్ లో నటించారు.

తాజాగా తెలుగులో థమ్స్ అప్ యాడ్ నటించే బంపర్ ఆఫర్ యువ హీరో విజయ్ దేవర కొండకు దక్కింది. దేశంలోని అన్ని భాషల్లోనూ ప్రముఖ నటులతో యాడ్ చేసే థమ్స్ అప్ తెలుగులో రౌడీ హీరో విజయ్ ను ఎంచుకుంది. విజయ్ నటించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘ లైగర్’లో విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎప్పటి కప్పుడు హైప్ ను క్రియేట్ చేస్తున్నది.

అనుపమ పరమేశ్వరన్‌ గర్భవతి అయ్యిందా ?

జోరుమీదున్న రంగ‌మ్మ‌త్త‌

తెర‌పై రీఎంట్రీ ఇస్తున్న ప‌వ‌ర్ స్టార్ మాజీ భార్య‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -