టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై శ్రీరెడ్డి చేసిన అర్దనగ్న ప్రదర్శన సంచలనం అయిన సంగతి తెలిసిందే.తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం పడుకోవలని సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు అవకాశలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నాడని తెలిపి సంచలనానికి తెరలేపింది.అయితే శ్రీరెడ్డి చేసిన పనిని అపట్లో చాలామంది విమర్శించారు.
తాజాగా శ్రీరెడ్డిపై నటి రాధా ప్రశాంతి తనదైన రీతిలో మండిపడ్డారు.సినిమా ఇండస్ట్రీలో మంచి, చెడు ఉంటుంది.ఏ దారిలో వెళ్లాలనే ఆప్షన్ మన చేతిలోనే ఉంటుందని రాధా ప్రశాంతి తెలిపారు.మనం చేసే పని చెడు అని తెలిసి కూడా వెదవ పనులు చేయడం ఎందుకు? చేసేదంతా చేసి అన్నీ అయిపోయాక మీడియా ముందుకొచ్చి గుడ్డలూడదీసుకుని మా దగ్గరికి వాళ్లొచ్చారు, వీళ్లొచ్చారు అని అనడం ఎందుకు? అని శ్రీరెడ్డిని ఉద్దేశించి మాట్లాడింది.ఇండస్ట్రీలో కమిట్మెంటు అడిగే వారి నుండి తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి.
నువ్వు డబ్బులు కోసం ఇలా చేశావో,అవకాశాలు కోసం చేశావో ఎవరికి తెలుసు అని ప్రశాంతి మండి పడ్డారు.ఇక్కడ ఎవరూ ఎత్తుకెళ్లి రేప్ చేయరు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు. దాసరి గారు ఉంటే ఇలా జరిగేది కాదని అని రాధా ప్రశాంతి అభిప్రాయ పడ్డారు.