Friday, April 19, 2024
- Advertisement -

దాసరి తర్వాత చిరంజీవే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు..!

- Advertisement -

ప్రస్తుతం మా ఎన్నికల హడావుడి నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నాగబాబు.. మా అధ్యక్షుడు నరేశ్​ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక ఈ సారి మెగా కుటుంబం మద్దతుతో ప్రకాశ్​రాజ్​ బరిలో నిలవగా.. కొందరు సీనియర్​ నటుల సపోర్ట్​తో మంచు విష్ణు పోటీలో ఉన్నారు. జీవిత రాజశేఖర్​, హేమ, సీవీఎల్ నరసింహారావు కూడా బరిలో ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాఇంకా క్లారిటీ లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ వేడి అప్పుడే మొదలైంది.

సెలబ్రిటీలు పైగా సినిమా నటుల ఎన్నిక కాబట్టి మీడియా దృష్టి మొత్తం అటువైపే ఉంది. మాది ఓ చిన్న సంఘం కేవలం 900 సభ్యులున్న సంఘం ఎందుకు మీడియా ఇంత ఎందుకు హడావుడి చేస్తుంది అంటూ మా సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమపై తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

’ గతంలో సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి నారాయణరావు ముందుండి పరిష్కరించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతను చిరంజీవి తన మీద వేసుకున్నారు. నేనే ఓ రోజు చిరంజీవి గారితో ఈ విషయం ప్రస్తావించాను. గతంలో ఏ సమస్య వచ్చినా దాసరి నారాయణరావు చూసుకొనే వారు. ఆయన ఎంతో మందికి అన్నం పెట్టారు. ఆదుకున్నారు. అవకాశాలు ఇప్పించారు.’ అని మురళి మోహన్​ పేర్కొన్నారు. ప్రస్తుత మా ఎన్నికల్లో ప్రకాశ్​రాజ్​కు ..చిరంజీవి మద్దతు ఇస్తున్నాడు. ఆయన ప్యానెల్​ను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ సామాజికవర్గం చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మురళి మోహన్​ చిరంజీవికే మద్దతుగా మాట్లాడటం గమనార్హం.

Also Read

ఇంగ్లీష్​లో డబ్​ అయిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -