Friday, May 17, 2024
- Advertisement -

సంబ‌రాల్లో బాల‌య్య అభిమానులు…

- Advertisement -

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ నడుస్తోంది. ఏ థియేటర్ వద్ద చూసినా ‘అజ్ఞాతవాసి’ హంగామానే. పవన్ అభిమానులు సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూన్నా సినిమా మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాల‌య్య అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

2018 సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తో పాటు నందమూరి బాలకృష్ణ జై సింహ , సూర్య గ్యాంగ్ , రాజ్ తరుణ్ రంగుల రాట్నం చిత్రాలు రాబోతున్న సంగతి తెల్సిందే. బరిలో నాల్గు సినిమాలు ఉన్నప్పటికీ జై సింహ , అజ్ఞాతవాసి చిత్రాల పైనే అందరి దృష్టి. గత ఏడాది మెగా స్టార్ చిరంజీవి కి పోటీగా వచ్చి శాతకర్ణి తో చక్కటి విజయం అందుకున్న బాలయ్య , ఈసారి పవన్ కు పోటీగా రంగం లోకి దిగాడు. మరి ఈ ఇద్దరి లో ఎవరు ఫై చేయి సాధిస్తారా అనేది ప్రశ్న.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్ధరాత్రి నుండే ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఓవర్సీస్ లో ఈ చిత్ర ప్రీమియర్ షోస్ పడడం తో తెల్లారేసరికి సినిమా టాక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం సినిమాకు డివైడ్ టాక్ రావడం తో నందమూరి అభిమానులు పండగా చేసుకుంటున్నారు. అనుకున్నంత అంచ‌నాలు అందుకోలేక‌పోయింద‌ని ప‌వ‌న్ అభిమానులే చెప్ప‌డం విశేషం.

నిన్నటి వరకు కాస్త ఖంగారు పడ్డ అభిమానులు , అజ్ఞాతవాసి టాక్ డివైడ్ గా రావడం తో వారు సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి కి బాలయ్య విజేత అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క మెగా అభిమానులు మాత్రం కాస్త నిరాశలో ఉన్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే త్రివిక్రమ్ ఇలా తీసాడేంటి అని చెప్పుకుంటూ ఫీల్ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -