దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కరోనా కట్టడిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రుల్లో ఇతర సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తాను త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానన్నారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా బారినపడిన వారికి అవసరమైన మేరకు ఆసుపత్రుల్లో పడకలు, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. పరిస్థితిని ముందే అంచనా వేసి వాటిని ఏర్పాటు చేయలేకపోవడం వల్లే ఆందోళనకర స్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరించిన నర్సు అరెస్ట్!
మహారాష్ట్ర, ఢిల్లీ లో కరోనా డేంజర్ బెల్!