బాగా ఆలోచించి.. చించి చించి చివరకు ఓ సినిమాను అక్కినేని అఖిల్ ఎంచుకున్నాడు. సినిమా సినిమాకు దాదాపు ఆరు నెలల నుంచి ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నా సరైన విజయాలు దక్కక బాధపడుతున్న అఖిల్ తన మూడో సినిమాను ప్రారంభించాడు. ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరీ దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడు. బీవీఎన్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అఖిల్ తన తొలి సినిమా నుంచి కొత్త హీరోయిన్లతోనే నటిస్తున్నాడు. తొలిసారి తన సినిమాను నిర్మించిన హీరోతో నటించిన హీరోయిన్తో అఖిల్ రొమాన్స్ చేయనున్నాడు. వెంకీ, అఖిల్ సినిమాలో లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాశ్ను హీరోయిన్గా ఎంపిక చేశారంట. అఖిల్ నంటించిన ‘అఖిల్’ నితిన్ నిర్మాతగా వ్యవహరించిన నితిన్ ఆ తర్వాత నితిన్ చేసిన సినిమా ‘లై’. ఆ సినిమాలో మేఘా ఆకాశ్ నటించింది. ఆ తర్వాత మళ్లీ నితిన్తో కలిసి మేఘా ‘ఛల్ మోహనరంగ’లో నటించింది. ఇప్పుడు మూడో సినిమా అఖిల్తో నటిస్తోంది.
నితిన్తో ఉన్న పరిచయంతో అఖిల్తో మేఘా ఆకాశ్ను తీసుకున్నారని సమాచారం. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మూడో సినిమాకు ఎటువంటి భారీ అంచనాలు లేకుండా సింపుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాను అఖిల్ చేస్తున్నాడు.