అక్కినేని అఖిల్కు భార్యగా కాబోయి తృటిలో మిస్సయిన అమ్మాయి ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. అఖిల్తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు అఖిల్తో వేగలేక ఆ అమ్మాయి విడిపోయిందని తెలిసింది. ఆ తర్వాత వీరి పెళ్లి కావడం లేదని అందరూ అంచనా వేశారు. అది నిజమేనని ఇప్పుడు తేటతెల్లమవుతోంది.
ఆ అమ్మాయే శ్రేయా సోం భూపాల్. ఈమెతో అఖిల్ ప్రేమించి నిశ్చితార్థం దాకా వెళ్లి ఆ తరువాయి పెళ్లి అనుకుంటే అంతా పల్టీ కొట్టింది. కారణాలు తెలియలేదు కానీ అఖిల్తో ఆమె పెళ్లి రద్దయ్యింది. ఇప్పుడు శ్రేయ భూపాల్ వేరొకరిని పెళ్లి చేసుకోనుంది. అది మెగా కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తితోనే శ్రేయ పెళ్లి జరగనుంది.
ఆనందిత్ రెడ్డితో శ్రేయా జూలై 6వ తేదీన పెళ్లి చేసుకోనుంది. ఆనందిత్ అపోలో గ్రూప్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను జాతీయ స్థాయి రేసింగ్ ఛాంపియన్ కూడా. ఇతను తండ్రి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తల్లి సంగీతారెడ్డి. సంగీతారెడ్డి ఎవరో కాదు రామ్ చరణ్ భార్య ఉపాసనకు స్వయానా పిన్ని. వీళ్ల సంతానమే ఆనందిత్ రెడ్డి. అంటే ఇతగాడు రామ్చరణ్కు బావమరిది వరుస అవుతాడు.
ఏప్రిల్ 20వ తేదీన భారీ ఎత్తున నిశ్చితార్థం జరగనుంది. ఆ తర్వాత జూలై 6వ తేదీన పెళ్లికి నిశ్చయించినట్లు సమాచారం.