‘పటాస్’ సినిమా హిట్ తర్వాత ఇజంతో వచ్చిన నందమూరి కల్యాణ్రామ్ నిరాశతో మిగిలి ఉన్నాడు. తర్వాత తమ్ముడితో ‘జై లవకుశ’తో నిర్మాతగా మంచి విజయం పొందాడు. ఆ తర్వాత ఇప్పుడు ‘ఎమ్మెల్యే’ (మంచి లక్ష్యాలు ఉన్న అబ్బాయ్)తో వస్తున్నాడు. రచయితగా ఉన్న ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నాడు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ దాఆదాపు పూర్తవుతుంది. అయితే హీరోయిన్ కాజల్ అగర్వాల్తో కలిసి స్టెప్పులేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్కు చివరిదశకు చేరడంతో ఇప్పుడు సినిమా పాటలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్ అజర్బైజాన్లోని బాకు సిటీలో చేస్తున్నారు. అందమైన లోకేషన్లో పాట షూటింగ్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ కెమిస్ట్రీ బాగా వర్కవుటవుతోంది. డ్యూయట్ సాంగ్కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. బ్లూ ప్లానెట్ బ్యానర్పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, మనాలీ రాథోడ్, రవికిషన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మే చివరాఖరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.