విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలనుంచి నేర్చుకున్న అనుభవమో ఏమో కానీ కొత్త దర్శకులతో అయితే సినిమా చెయ్యట్లేదు. ప్రస్తుతం అయన చేస్తున్న దర్శకుడి దగ్గరినుంచి తాను చేయబోయే నెక్స్ట్ సినిమా వరకు పెద్ద దర్శకులను నమ్ముకున్నాడు.. గతంలో చిన్న, కొత్త దర్శకులతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.. గీత గోవిందం తర్వాత విజయ్ కి ఆ రేంజ్ హిట్ పడలేదని చెప్పాలి.. ఆ తర్వాత చేసిన సీనియాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి.. డియర్ కామ్రేడ్ సినిమా పర్వాలేదనిపించింది. ఇటీవలే వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వరల్డ్ ఫేమస్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.. అందుకే ఇక పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలనీ విజయ్ డిసైడ్ అయినట్లు ఉన్నాడు..
ఆ కోవలోనే పూరి జగన్నాధ్ తో ఓ సినిమా చేస్తున్నాడు.. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకోగా సమ్మర్ లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది. ఈలోగానే విజయ్ దగ్గర్నుంచి సుకుమార్ తో సినిమా అని ఓ పెద్ద ప్రకటన వచ్చింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ .. హీరో విజయ్ దేవరకొండల కలయికలో ఒక క్రేజీ పాన్-ఇండియన్ చిత్రం ప్రకటించడం సంచలనమే అయ్యింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని కేదర్ సెలగంసెట్టి `ఫాల్కన్ క్రియేషన్స్` బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరు? ఉన్నట్టుండి కొత్త పేరు తెరపైకొచ్చిందే అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.
అల్లు సర్కిల్స్ కి తెలిసిన వాడేనట ఈ నిర్మాత.. స్టార్ హీరో అల్లు అర్జున్ కు కేదర్ మంచి స్నేహితుడు. ఇటీవలే స్టైలిష్ స్టార్ కేదార్ ను కలుసుకున్నారట. ఆ టైం లో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టిన కేదార్ విజయ్ తో సీఎంగా చేయమని చెప్పారట.. విజయ్ కూడా పెద్ద డైరెక్టర్ ను ఒప్పించమని చెప్పడంతో బన్నీ సహాయం తో సుకుమార్ ని ఈ సినిమా కి సెట్ చేశారట.. ఏదైతేనేం ఈ సినిమా తో కొత్త రికార్డ్స్ ఏమైనా నమోదు అవుతాయా అన్నది చూడాలి..
మహేష్ , బన్నీ కి వారు కరువయ్యరుగా..?
ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇంత ప్లాన్ చేస్తున్నాడా….?