- నా పేరు సూర్య చిత్రీకరణ కోసం
డీజే తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా నా పేరు సూర్య. ఇప్పుడు బన్నీ సందడి చేయడానికి గోఆ బయల్దేరి వెళ్లాడు. తన సినిమా కోసం అందాల సముద్ర తీరం గోవాకు వెళ్లాడు. తన సినిమా షెడ్యూల్ను అక్కడ ప్రారంభించబోతున్నాడు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నా పేరు సూర్య’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో పూర్తి చేసుకొని ఇప్పుడు గోవాకు వెళ్లారు.
సైనిక నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ తన శారీరక ధారుడ్యంలో మార్పులు చేర్పులు చేసుకొని షూటింగ్లో పాల్గొంటున్నాడు. గోవాలో యాక్షన్ సన్నివేశాలు తీయబోతున్నారు. సినిమాకు సంబంధించి ఊటీలో కూడా భారీ షెడ్యూల్ చేశారు.
ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి 50శాతం పూర్తయిపోతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మూవీకి సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ తో పాటు విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారు. నా పేరు సూర్య సినిమాలో అర్జున్, శరత్ కుమార్ రెండు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు మలయాళంలో ఒకేసారి ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్. డీజే తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా నా పేరు సూర్య.